Namaste NRI

శాసనసభకు ఎన్నికైన  మహిళా అభ్యర్థులు వీరే

తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి పదిమంది మహిళా ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లనున్నారు. వీరిలో తొలిసారిగా ఎన్నికైన వారే అధికంగా ఉండటం విశేషం. కొత్తగా విజయం సాధించిన వారిలో కంటోన్మెంట్ నుంచి లాస్యా నందిత,పాలకుర్తిలో యశస్విని, నారాయఖేడ్‌లో వర్నికారెడ్డి ఉండగా ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మీ, నర్సాపూర్‌లో సునీతా లక్ష్మా రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ తూర్పులో కొండా సురేఖ, ములుగులో సీతక్క, కోదాడలో పద్మావతి, మరో సారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గత అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి , రేఖానాయక్ మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఈ సారి అదనంగా నలుగురు గెలుపొందారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events