సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రాశి ఖన్నా, శ్రీనిధిశెట్టి హీరోయిన్లుగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా. నీరజ కోనా దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ సినిమా అప్రిషియేట్ మీట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. నాకు మనశ్శాంతినిచ్చిన సినిమా తెలుసు కదా. ఈ విషయంలో డైరెక్టర్ నీరజకు థ్యాంక్స్ చెప్పాలి. నా ఆలోచనలను తీసుకొని ఈ కథలో గొప్పగా ఇంప్లిమెంట్ చేసింది తను. ఈ సినిమాను అందరూ రాడికల్ అంటున్నారు. మంచి ప్రొడక్ట్ కోసం డబ్బుకు అస్సలు వెనుకాడలేదు నిర్మాత విశ్వప్రసాద్. పనిచేసిన వారంతా మనసుపెట్టి పనిచేశారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి గుర్తుండిపోతుంది అని అన్నారు.

బండ్ల గణేశ్, కోన వెంకట్, ఎస్కేఎన్, డైరెక్టర్ సందీప్రాజ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి అభినందనలు అందించారు. యునిక్ పాయింట్తో వచ్చిన ఓ కొత్త దర్శకురాలికి సిద్ధు అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని, అందరూ ఈ సినిమాను అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్నారు. డెబ్యూ డైరెక్టర్గా తనని నమ్మి అవకాశం ఇచ్చిన హీరోకీ, నిర్మాతలకు దర్శకురాలు నీరజ కోన కృతజ్ఞతలు తెలిపారు.
















