
సంపత్నంది దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ఓదెల 2. ఓటీటీ హిట్ ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు ఇది సీక్వెల్. తమన్నా ప్రధాన పాత్ర పోషించారు. అశోక్ తేజ దర్శకుడు. డి.మధు నిర్మాత. ఈ నెల 17న సినిమా విడుద లైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్మీట్లో సంపత్నంది మాట్లాడారు. ఈ సినిమా విషయంలో మేం ఏమీ ప్లాన్ చేసుకోలేదు. అన్నీ వాటంతటవే జరిగిపోయాయి. ఈ కథను ఆ శివుడే నాతో రాయించాడు. ప్రతి టెక్నీషియన్ ప్రాణంపెట్టి పనిచేశాడు. 20ఏళ్ల తమన్నా కెరీర్ ఒకపైపు, ఓదెల 2 ఒకపైపు అని అందరూ అంటున్నారు. వశిష్ట ఎన్.సింహాకు ఈ సినిమా పెద్ద బ్రేక్. ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అని అన్నారు. తాము రివ్యూయర్స్ కోసం సినిమా చేయలేదని, ప్రేక్షకుల కోసమే సినిమా తీశామని, సినిమా బాగుంది కాబట్టే కలెక్షన్స్ పెరుగుతున్నాయని దర్శకనిర్మాతలు అశోక్తేజ, మధు పేర్కొన్నారు.
