Namaste NRI

టైమ్ మ్యాగజైన్ మెచ్చిన పూర్ణిమ

టైమ్ మ్యాగజైన్ అందించే విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు అస్సాంకు చెందిన భారతీయ జీవ శాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకురాలు పూర్ణిమా దేవి బర్మన్ ఎంపికయ్యారు. మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న అసాధారణ నాయకులను గౌరవించేందుకు టైమ్ మ్యాగజైన్ ఈ ఏడాది ఎంపిక చేసిన మిమెన్ ఆఫ్ ది ఇయర్-2025 జాబితాలో పూర్ణిమా దేవి బర్మన్ ఉన్నారు. 13 మంది మహిళలతో టైమ్ మ్యాగజైన్ ఈ జాబితా రూపొందించగా, అందులో పూర్ణిమాదేవి ఒక్కరే భారతీయ మహిళ కావడం విశేషం. అస్సాంలో గ్రేటర్ అడ్జంటర్ అనే జాతి కొంగల సంరక్షణకు పూర్ణి మ ఎంతో కృషి చేశారు.

Social Share Spread Message

Latest News