వైష్టవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రంగ రంగ వైభవంగా. అర్జున్ రెడ్డి ఫేం గిరీసాయ దర్శకత్వం వహిస్తున్నాడు. కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తుంది. బాపినీడు.బి సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ రంగ రంగ వైభవంగా ట్రైలర్ ఎంత బాగుందో సినిమా అంతకంటే బాగుంటుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి వల్లే ఓ మంచి టీమ్ కలిసి చక్కని సినిమాను తీసుకొస్తున్నాం. మా చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేసి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. గిరీశాయ మాట్లాడుతూ అహం లేని ఏ బంధం అయినా రంగ రంగ వైభవంగా ఉంటుందని చెప్పటమే మా సినిమా కథ అన్నారు. మా సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. బీవీఎస్ ప్రసాద్. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.














