Namaste NRI

బోనీ కపూర్ కుటుంబానికి యూఏఈ బంపర్ ఆఫర్

యూఏఈ ప్రభుత్వం 2019 నుంచి వివిధ రంగాల్లో దేశానికి కృషి చేసిన వారికి గోల్డెన్‌ వీసాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఐదు, పదేళ్ల కాలపరిమితితో గోల్డెన్‌ వీసా ఇస్తోంది. భారత్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇప్పటి వరకు గోల్డెన్‌ వీసా అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. ఇక సినీ రంగంలో కూడా పలువురు భారత నటులకు గోల్డెన్‌ వీసా వచ్చింది. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్‌ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ చేరారు. బోనీ కపూర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దుబాయ్‌ 10 ఏళ్ల గోల్డెన్‌ వీసా మంజూరు చేసింది. ఈ విషయాన్ని బోనీ కపూర్‌ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్‌ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తనతో పాటు తన ఫ్యామిలీకి పదేళ్ల కాలపరిమితితో గోల్డెన్‌ వీసా మంజూరు చేసినందుకు దుబాయ్‌ పాలకులకు థ్యాంక్స్‌ చెప్పారు. ఇది తన కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవంగా ఆయన పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events