ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని జి`7 దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వర్చువల్గా భేటీ అయ్యారు. ఈ యుద్ధంలో పుతిన్ విజయం దక్కడం అసాధ్యమని జి`7 దేశాల నాయకులు తేల్చి చెప్పారు. కాగా పోలండ్లోని రష్యా రాయబారి సెర్గీ అండ్రీవ్కు నిరసన సెగ తగిలింది. వార్సాలోని సోవియట్ సైనిక శ్మశాన వాటికలో దివంగత రెడ్ ఆర్మీ సైనికులకు నివాళులర్పించకుండా అండ్రీవ్ను అడ్డుకున్నారు. ఆయనపై ఎర్రరంగు చల్లారు.














