
నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం నుండి (జూలై 4,5,6) మూడు రోజుల పాటు టాంపాలో నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రముఖ సినీనటుడు విక్టరీ వెంకటేష్ టాంపాకు చేరుకున్నారు. నిన్న సాయంత్రం నిర్వహించిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో పాల్గొన్న ఆయన క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా టాంపాలో సందడి చేశారు. శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో నాట్స్ సంబరాలు ప్రారంభమవుతాయి. సినీనటుడు బాలకృష్ణ గురువారం నాడు మియామీ చేరుకుంటారని సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు తెలిపారు.















