Namaste NRI

భారతీయులకు వీసా-ఫ్రీ ట్రాన్సిట్‌ సౌకర్యం

తమ దేశంలోని విమానాశ్రయాల మీదుగా ప్రయాణించే భారతీయ పాస్‌పోర్టు హోల్డర్లకు వీసా-ఫ్రీ ట్రాన్సిట్‌ సౌకర్యాన్ని జర్మనీ ప్రకటించింది. ఈ చర్యతో భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణం సులభతరం కావడమేగాక రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పటిష్టం చేసే అవకాశం ఉంది. ఈ నెల 12-13న జర్మనీ చాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ భారత పర్యటన సందర్భంగా ప్రకటన వెలువడింది. ఇది మెర్జ్‌ భారత తొలి పర్యటనేగాక జర్మనీ చాన్సలర్‌గా ఆసియాకు మొదటి సందర్శన. వీసా-ట్రాన్సిట్‌ సౌకర్యం వల్ల జర్మనీ మీదుగా వేరే దేశానికి ప్రయాణించే భారతీయ ప్రయాణికులు విడిగా ట్రాన్సిట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవలసిన అవసరం ఉండదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events