Namaste NRI

ఉక్రెయిన్ లో భారతీయులకు హెచ్చరిక … అనవసర ప్రయాణాలొద్దు

ఉక్రెయిన్ రాజదాని కీవ్ సహా పలు నగరాలపై మళ్లీ రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడి తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య ఉద్రికత్తలు పెరగడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కీవ్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు కీలక హెచ్చరికలు చేసింది. ఉక్రెయిన్ ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని కోరింది. ఉక్రెయిన్పై రష్యా దాడులు పెంచిన నేపథ్యంలో ఉక్రెయిన్కు వెలుపల భారతీయులు అనవసర ప్రయాణాలను నివారించాలని సూచించింది. ఉక్రెయిన్లో భారతీయులు తమ పరిస్థితిని రాయబార కార్యాలయానికి తెలియజేయాలని సూచించింది.

Social Share Spread Message

Latest News