Namaste NRI

అమెరికా కోసమే ఈ పనులన్నీ చేశాం: ఖవాజా

తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్‌, ఇప్పుడు యూటర్న్‌ తీసుకుంది. గత మూడు దశాబ్దాలపాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తున్నది నిజమేనని అంగీకరించింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ బహిరంగంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే ఆ పాపానికి అమెరికా, పశ్చిమ దేశాలే కారణమని ఆరోపించారు. మంత్రి చేసిన ప్రకటనతో పాక్‌ను ఉగ్రదేశమని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నదని భారత్‌ చేస్తున్న ఆరోపణలు నిజమేనని మరోసారి రుజువైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events