
సందీప్కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మజాకా. రీతూవర్మ కథానాయిక. రావురమేష్, అన్షూ కీలక పాత్రధారులు.నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్మీట్లో సందీప్ కిషన్ మాట్లాడారు. నేను ఎంజాయ్ చేసి చేసిన సినిమా ఇది. ఇంటిల్లిపాదీ హాయిగా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. థియేటర్లో అందరితో కలిసి చూశాను. మా లక్ష్యం నెరవేరిందని అర్థమైంది. చివర్లో ఎమోషన్కి కూడా బాగా కనెక్టయ్యారు. ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చెప్పలేనంత ఆనందాన్నిస్తున్నది అని అన్నారు.

నవ్వొచ్చినప్పుడు నవ్వాలి. ఏడుపొచ్చినప్పుడు ఏడవాలి. అప్పుడే హెల్త్ బావుంటుంది. ఈ రెండూ ఈ సినిమాలో ఉన్నాయి. ఆ విషయంలో మేం సక్సెస్ అయ్యాం. తప్పకుండా థియేటర్లోనే చూడాల్సిన ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇది అని దర్శకుడు త్రినాథరావు నక్కిన చెప్పారు. తాను రాసిన ప్రతి పదానికీ గౌరవం తెచ్చేంత గొప్పగా త్రినాథరావు నక్కిన ఈ సినిమా తీశారని రైటర్ ప్రసన్న అన్నారు. ఈ సినిమా విషయంలో తమ అంచనాలన్నీ నిజమయ్యాయని నిర్మాత రాజేష్ దండా తెలిపారు. ఇంకా కథానాయికలు రీతూవర్మ, అన్షు, నిర్మాత అనిల్ సుంకరలతోపాటు అతిథులుగా విచ్చేసిన దర్శకులు రామ్ అబ్బరాజు, ఐవి ఆనంద్ కూడా మాట్లాడారు.
