
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెందిరింపుల నేపథ్యంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక హెచ్చరికలు చేసింది. హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఖర్గ్ ద్వీపం, విద్యుత్ కేంద్రాలను పేల్చి వేస్తామని ట్రంప్ హెచ్చరించగా, తామేమీ తక్కువ కాదంటూ యాపిల్, మైక్రోసాప్ట్ సహా ఆ దేశానికి చెందిన 18 కంపెనీలపై దాడులు చేస్తామని ఐఆర్జీసీ బదులు హెచ్చరిక చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమెరికాలోని టెక్ కంపెనీలే తమ ప్రధాన లక్ష్యమని ఐఆర్జీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.















