Namaste NRI

యడియూరప్ప రాజీనామా

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడిరది. ముఖ్యమంత్రి పదవికి బీఎస్‌ యడియూరప్ప రాజీనామా చేశారు. తొలుత సాయంత్రం గవర్నర్‌ను కలిసి తన రాజీనామాను పత్రాన్ని సమర్పిస్తానన్నారు. కానీ, తన మనసు మార్చుకుని మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజీనామాను పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. కాగా, రెండేళ్ల పాలన వేడుకల్లో ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు యడ్డీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా, కర్ణాటక అభివృద్ధి కోసంం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events