Namaste NRI

కేసీఆర్‌ను పరామర్శించిన వైఎస్‌ సీఎం జగన్‌

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ప్రత్యేక విమానంలో  తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సీఎం జగన్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్.

కేసీఆర్‌ ఇటీవలే తన ఫామ్‌హౌస్‌లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌కు వైద్యులు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం కేసీఆర్‌ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ కేసీఆర్‌ను పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ అధినేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే పలువురు రాజకీయ నాయకులు కేసీఆర్ ను పరామర్శించారు.

Social Share Spread Message

Latest News