నూతన సంవత్సరం బహుమతిగా హైదరాబాద్ షేక్ పేట ఫ్లైఓవర్ వంతెనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
హీరో సాయిధరమ్ తేజ్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ లోని సాయిధరమ్ తేజ్ నివాసానికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం రోడ్డు ప్రమాదం, తదితర విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం.
నూతన సంవత్సరం సందర్భంగా తితిదే అర్చకులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వదించారు
అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో నెమలి కోనాం చేప పర్యాటకులను ఆకర్షించింది. 30 కిలోల బరువు, ఎనిమిది అడుగుల పొడవు ఉండే ఈ మత్స్యం వెన్నుపై నెమలికి ఉండే పించం వలే ఉంది. ఇది అంతర్వేది తీరంలో కాకినాడ మత్స్యకారుల వలకు చిక్కింది.