Namaste NRI

హీరో సాయిధరమ్ తేజ్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ లోని సాయిధరమ్ తేజ్ నివాసానికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం రోడ్డు ప్రమాదం, తదితర విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం.

అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో నెమలి కోనాం చేప పర్యాటకులను ఆకర్షించింది. 30 కిలోల బరువు, ఎనిమిది అడుగుల పొడవు ఉండే ఈ మత్స్యం వెన్నుపై నెమలికి ఉండే పించం వలే ఉంది. ఇది అంతర్వేది తీరంలో కాకినాడ మత్స్యకారుల వలకు చిక్కింది.