
అమెరికా నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిషన్ డిపోర్టేషన్ మరింత వేగంగా కొనసాగుతుండటంతో ఈ ఆగస్టు మొదటి 15 రోజుల్లోనే ఏకంగా 5,200 మంది భారతీయులను అమెరికా నుంచి స్వదేశానికి పంపించారు. ఇందులో హెచ్-1బీ, ఓ-1 వీసాలు ఉన్న విద్యార్థులు కూడా ఉండటం విశేషం. ఇందులో నైపుణ్యాలున్న నిపుణుల సంఖ్య గణనీయంగా ఉన్నట్టు తెలుస్తున్నది. 2025లో అత్యధికంగా 3,567 మంది భారతీయులను వెనక్కు పంపించేశారు. వారంతా అక్రమ వలసదారులేనని ఐసీఈ వెల్లడించింది. జూన్ నెలలోనే 801 మంది భారతీయుల తొలగింపునకు ఐసీఈ ఆదేశాలు జారీ చేసింది.















