Skip to main content

Namaste NRI

రణబాలి లో జయమ్మ షూటింగ్ పూర్తి

విజయ్‌ దేవరకొండ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రణబాలి చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె జయమ్మ అనే కీలకమైన పాత్రను పోషిస్తున్నది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా ఆమెకు వీడ్కోలు తెలుపుతూ చిత్రబృందం భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ విషయాన్ని తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చారిత్రాత్మక పాన్‌ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events