బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ సమీపిస్తున్న క్రమంలో చైనా తాజాగా మరోసారి అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విశ్వక్రీడల విషయంలో జోక్యం చేసుకోవడాన్ని మానుకోవాలని హెచ్చరించింది. యూరప్తో రష్యాతో నెలకొన్న భద్రతా ఆందోళనలను తీవ్రంగా పరిగణించాలని సూచించింది. చైనా, అమెరికా విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, ఆంటోని బ్లింకెన్ల తాజా టెలిఫోన్ సంభాషణపై డ్రాగన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బీజింగ్లో ఫిబ్రవరి 4 నుంచి వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించాలని చైనా పట్టుదలతో ఉంది. అయితే షింజియాంగ్ ప్రావిన్స్ తదితర చోట్ల మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ అమెరికా ఈ వింటర్ ఒలింపిక్స్ దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వాంగ్ యీ మాట్లాడుతూ బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో అమెరికా తన జోక్యాన్ని మానుకోవడమే అత్యంత ముఖ్యమైన విషయమని తెలిపారు. తైవాన్ సమస్యపై నిప్పుతో చెలగాటమాడటాన్ని ఆపేయాలని స్పష్టం చేశారు.














