హాంగ్ కాంగ్కు వచ్చే ప్రయాణికులు ఇకపై 21 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో హాంగ్ కాంగ్ కూడా కట్టుదిట్టమైన నిబంధనలను రూపొందించి అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే హాంగ్ కాంగ్కు వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికులు హాంగ్కాంగ్కు చేరుకున్న తర్వాత మూడు వారాలు అంటే 21 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండాల్సిందేని అని తేల్చి చెప్పింది. ఈ నిబంధనను హాంగ్ కాంగ్ తాజాగా సవరించింది. ప్రయాణికులు స్థానికంగా ఉన్న హోటళ్లలో 14 రోజులపాటు క్వారెంటైన్లో ఉంటే సరిపోతుందని వెల్లడిరచింది. క్వారెంటైన్ పూర్తైన తర్వాత మరో 7 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలని వెల్లడిరచింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 5 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.














