సప్తగిరి, శృతిపాటిల్ జంటగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాలు మున్నంగి క్లాప్ కొట్టారు. సురేష్ కోడూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ నెల 21 నుండి రెగ్యులర్ షూటింగ్ను కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. 1990 నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో వినోదంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలుంటాయి అన్నారు. సురేష్ కోడూరి దర్శకుడు. వలసపల్లి మురళీమోహన్ నిర్మాత. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీధర్ నార్ల, మాటలు: జీవీవీకే చిరంజీవి (గోపీ).














