ఉత్తర కొరియాపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏ మాత్రం తగ్గడం లేదు. క్షిపణులను అభివృద్ధి చేసుకునే విషయంలో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ దేశం తన అణ్వాయుధ క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. మరిన్ని అణ్వాయుధాల అభివృద్ధికి కావాల్సిన సామగ్రిని కూడా ఉత్తర కొరియా సమకూర్చుకుందని పేర్కొన్నారు. క్షిపణీ పరీక్షలను వేగవంతం చేసిందని తెలిపారు. ఉత్తర కొరియా అణ్వాస్త్రాలను అవసరమైన సాంకేకేతికతను సైబర్ మార్గం లో సంపాదిస్తోందని అన్నారు. ఆర్థిక సంపత్తిని సైబర్ దాడులతో సంపాదిస్తోందని తెలిపారు.














