బహ్రెయిన్లో లులు గ్రూప్స్ అధినేత యూసుఫ్ అలీకి అరుదైన గౌరవం దక్కింది. యూసుఫ్ అలీకి అక్కడి ప్రభుత్వం గోల్డెన్ రెసిడెన్సీ వీసాను అందించింది. దీంతో బహ్రెయిన్లో గోల్డెన్ రెసిడెన్సీ వీసా పొందిన తొలి వ్యక్తిగా యూసుఫ్ అలీకి గుర్తింపు పొందారు. ఈ విషయాన్ని స్వయంగా లులు గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. బహ్రెయిన్ నుంచి తొలి గోల్డెన్ రెసిడెన్సీ వీసాను అందుకోవడం పట్ల యూసుఫ్ అలీ సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో పొందిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా బహ్రెయిన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.














