Skip to main content

Namaste NRI

లులు గ్రూప్స్ అధినేతకు అరుదైన గౌరవం

బహ్రెయిన్‌లో లులు గ్రూప్స్‌ అధినేత యూసుఫ్‌ అలీకి అరుదైన గౌరవం దక్కింది. యూసుఫ్‌ అలీకి అక్కడి ప్రభుత్వం గోల్డెన్‌ రెసిడెన్సీ వీసాను అందించింది. దీంతో బహ్రెయిన్‌లో గోల్డెన్‌ రెసిడెన్సీ వీసా పొందిన తొలి వ్యక్తిగా యూసుఫ్‌ అలీకి గుర్తింపు పొందారు. ఈ విషయాన్ని స్వయంగా లులు గ్రూప్‌ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. బహ్రెయిన్‌ నుంచి తొలి గోల్డెన్‌ రెసిడెన్సీ వీసాను అందుకోవడం పట్ల యూసుఫ్‌ అలీ సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో పొందిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా బహ్రెయిన్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News