ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దొంగలున్నారు జాగ్రత్త. ప్రీతి అస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సముఖ ఖని కీలక పాత్రధారి. డి.సురేష్బాబు, సునీత తాటి, గురు ఫిల్మ్ నిర్మిస్తున్న చిత్రం ఇది శ్రీ సింహా బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. థ్రిల్లర్ కథతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో దొంగ కథేమిటి? దొరికాడా లేదా? అనే విషయాన్ని తెరపైనే చూడాలి. ఘన విజయం సాధించిన ఓ బేబీ తర్వాత మూడో చిత్రంగా రూపొందుతున్న దొంగలున్నారు జాగ్రత్త తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఫస్ట్లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోందని చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకు సంగీతం : రోహిత్ కులకర్ణి, కెమెరా: యశ్వంత్.సి.














