Namaste NRI

తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు

భౌగోళిక, ఆర్థిక కారణాల దృష్ట్యా బహ్రెయిన్‌లో నివసించే తెలుగువారితో సహా భారతీయుల సంఖ్య ఇతర దేశాలతో పోల్చితే స్వల్పమైనా సంస్కృతి, ఆచార వ్యవహారాల విషయంలో బహ్రెయిన్‌లోని ప్రవాసీయులు ఇతరులకు ఏ మాత్రం తక్కువ కాదు, పైగా కొంచెం పై చేయిగా ఉంటారు. ఈసా టౌన్‌లో మధ్య తరగతి లేదా సల్మాబాద్‌లో సగటు కార్మికుడు ఎవరైన సరే, సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు లేదా ఉత్సవాలు వస్తే అందరు సమానమే. ఈ క్రమంలో దుర్గా మాత నవరాత్రి ఉత్సవాలు, తెలంగాణ సంప్రదాయక పండుగ అయిన బతుకమ్మ ఉత్సవాలను కలిపి బహ్రెయిన్‌లోని తెలుగు ప్రవాసీయులందరి కొరకు బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి  ఆదిలియాలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారతీయ ఎంబసీలోని యువ దౌత్యవేత్త ప్రియాంక త్యాగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు కళా సమితి అధ్యక్షుడు హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఫణిభూషణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వంశీ, కోశాధికారి మురళీ, సాంస్కృతిక కార్యదర్శి ఫణి హనుమంతరావు, క్రీడా కార్యదర్శి రామ శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events