దుబాయ్లో జీబెల్ అలీ గ్రామంలో ఆధ్యాత్మిక నిలయమైన హిందువుల ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయం ప్రారంభం సందర్భంగా భక్తుల కరతాల ధ్వనులు, డప్పు చప్పులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ కార్యక్రమంలో దుబాయ్ మంత్రి షేక్ నయాన్ బిన్ ముబారక్, యూఏఈలోని భారత రాయబారి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఏడు చర్చిలు, ఒక గురుద్వారా ఉండగా తాజాగా హిందూ ఆలయం కూడా భక్తులకు అందుబాటులో వచ్చింది.














