ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ)లో శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం ఆమోదం పొందింది. మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి బాధ్యులెవరనేదానిపై విచారణ జరపాలని పేర్కొంటూ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు పెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 47 సభ్యదేశాల్లో 20 మంది ఓటేయగా, చైనా, పాకిస్థాన్ సహా 7 దేశాలు వ్యతిరేకించాయి. భారత్, జపాన్, నేపాల్, కతార్ సహా 20 దేశాలు గైర్హాజరయ్యాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)