దేవీ శరన్నవరాత్రి వేడుకలను సింగపూర్లో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఘనంగా నిర్వహించారు. ఉదయం విష్ణుసహస్ర నామాలు, సాయంత్రం అమ్మవారి ప్రత్యేక అలంకరణతో పాటు లలితా సహస్రం, మణిద్వీప వర్ణన, అమ్మవారి కీర్తనలు ఆలపించారు. మారియమ్మన్ కోవెలలో జరుగబోయే మహాకుంభాభిషేక క్రతువులో భాగంగా ఈ ఏడాది వైశ్యులంతా నిత్యనామస్మరణ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది దసరా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలను విజయవంతం చేసినందుకు క్లబ్ సభ్యులకు అధ్యక్షుడు అరుణ్కుమార్ గొట్లూరి, సెక్రెటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.














