Skip to main content

Namaste NRI

కీవ్‌ పై క్షిపణులతో భీకర దాడులు

లక్షలాది మంది ఉక్రేనియన్లను అంధకారంలోకి నెడుతూ విద్యుత్‌, నీటి వనరులే లక్ష్యంగా వైమానిక దాడులను రష్యా మరింత ఉధృతం చేసింది. కీవ్‌తో పాటు పశ్చిమంగా ఉన్న రిaటోమిర్‌ నగరంపైనా దాడులు పెరిగాయి. సైనిక స్థావరాలు, పరిశ్రమలు, రెండున్నర లక్షల జనాభాతో నిండిన రిaటోమిర్‌పై దాడుల నేపథ్యంలో నగరమంతా విద్యుత్‌, నీటి సరఫరా నిలిచిపోయింది. ఇంధనాగారం ధ్వంసమైంది. కీవ్‌పై దాడిలో ఇద్దరు మరణించారు. డినిప్రో సిటీపైనా  క్షిపణి దాడులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే రష్యా అధీనంలోకి వెళ్లిన జపోరిజియా  రష్యా డ్రోన్‌ దాడులు ఆగకపోవడం గమనార్హం.

Social Share Spread Message

Latest News