ప్రభాస్ రాముడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతివృత్తంతో ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. సీతగా కృతి సనన్ నటిస్తుండగా, లంకేశుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సంద్భంగా ఈ చిత్రం నుంచి కొత్త లుక్ విడుదల చేశారు. అందులో ఆయన రాముడిగా విల్లంబులు చేతబూని వానర సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరుతున్నట్లుగా కనిపించారు. మైథలాజికల్ కాన్సెప్ట్తో రామాయణాన్ని బేస్ చేసుకుని ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టీ సిరీస్, రైట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ త్రీడీ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.














