Namaste NRI

ఎలాన్‌ మస్క్‌ పై  …. జో బైడెన్‌ విమర్శలు

టెస్లా అధినేత, ట్విట్టర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  చికాగోలో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.  ప్రపంచానికి అబద్ధాలను పంపిస్తూ, అబద్ధాలను సృష్టించే సంస్థను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు మస్క్‌ కొన్నారంటూ ధ్వజమెత్తారు. మనం ఇప్పుడు దేని గురించి ఆందోళన చెందుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అబద్ధాలను పంపిస్తూ, సృష్టిస్తున్న సంస్థను ఎలాన్‌ మస్క్ కొన్నారు. ఎడిటర్స్ ఇక ఉండరు. ఏది ప్రమాదకరమో అర్థం చేసుకోగలిగే శక్తి పిల్లలకు ఉంటుందని ఎలా ఆశించగలం?’ అని బైడెన్ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events