Skip to main content

Namaste NRI

ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని  కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని తెలంగాణ సిఎం కేసిఆర్‌ తెలిపారు. కృష్ణ  మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఈ మేరకు నానక్‌రామ్‌గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేసీఆర్‌ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేష్‌ బాబును పరామర్శించారు. కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని, పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా చేశారని ప్రస్తావించారు. మంచి మిత్రుడుని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా చాలా సార్లు చూశానని గుర్తు చేసుకున్నారు. కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని వెల్లడించారు.

Social Share Spread Message

Latest News