గత కొంతకాలంగా వలస కార్మికుల పట్ల కఠినంగా వ్యవరిస్తోంది గల్ఫ్ దేశం కువైత్. వీసాలు, వర్క్ పర్మిట్ల కోసం ప్రవాసులకు ముప్పుతిప్పలు పెడుతోంది. కువైటైజేషన్ పాలసీ వచ్చిన తర్వాత నుంచి ఆ దేశంలో వలస కార్మికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక సెప్టెంబర్లో ఈజిప్ట్ వర్కర్లకు కువైత్ వర్క్ వీసాలు ఇవ్వడం నిలిపివేసింది. ఈజిప్టు రాయబార కార్యాలయం విధించిన షరతుల కారణంగా ఆ దేశ కార్మికులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయాలని కువైత్ మొదటి ఉప ప్రధాని, అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశించారు. తాజాగా ఈ సస్పెన్షన్ అలాగే కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.














