Namaste NRI

ఆది పినిశెట్టి శబ్దం ప్రారంభం

ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం శబ్దం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెవెన్‌ జీ ఫిల్మ్స్‌, అల్ఫా ఫ్రేమ్స్‌ పతాకాలపై 7జీ శివ నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, అరివళగన్‌ కాంబినేషన్‌లో వచ్చిన వైశాలి చిత్రం విజయం సాధించింది. శబ్దం కథ కూడా వైవిధ్యంగా ఉంటుంది. సినిమా తాలూకు మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం అని దర్శకుడు అన్నారు.  అరివళగన్‌ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించబోతున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: అరుణ్‌ పద్మనాభన్‌, సంగీతం: తమన్‌, రచన-దర్శకత్వం, లైన్‌ ప్రొడ్యూసర్‌: అరివళగన్‌.

Social Share Spread Message

Latest News