కేరింత ఫేమ్ పార్వతీశం కథానాయకుడిగా శ్రీబాలాజీ పిక్చర్స్ సంస్థ రూపొందిస్తున్న సినిమా తెలుసా మనసా. ఈ చిత్రంలో జశ్విక కథానాయిక. వైభవ్ దర్శకుడు. వర్షా ముందాడ, మాధవి నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ విలేజ్ బ్యాక్డ్రాప్లో కొనసాగే న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్స్టోరి ఇది. బెలూన్స్ అమ్ముకునే అబ్బాయికి, హెల్త్ అసిస్టెంట్గా పనిచేసే అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ ఇది అన్నారు. మహేష్ అచంట, అలీ రెజా, లావణ్య, మాస్టర్ అద్వితేజ్, వెంకీ, శివ, శోభన్ తదితరులు ఈ సినిమాలో ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రఫీ: ప్రసాద్ ఈదర, ఎడిటర్: పాపారావు.














