Namaste NRI

సైంధవ్‌ నుంచి మరో అప్‌డేట్‌

వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌.  శైలేష్‌ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తు న్నారు.  వెంకటేష్‌కు జోడీగా రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రను పోషిస్తున్నారు.  ఈ సినిమాలో సీనియర్‌ కథానాయిక ఆండ్రియా జెర్మియా..జాస్మిన్‌ అనే పాత్రలో కనిపించనుంది.  కథాగమనంలోని మలుపులకు ఆమె క్యారెక్టర్‌ ప్రధాన కారణంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో ఆండ్రియా చేతిలో గన్‌ పట్టుకొని పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నది. సినిమాలో ఆమె వేట ఎవరి కోసమన్నది ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.  ఇప్పటికే రిలీజైన పోస్టర్‌, గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ అయ్యాయి.  ఈ చిత్రానికి కెమెరా: మణికందన్‌, సంగీతం:: సంతోష్‌ నారాయణ్‌, రచన-దర్శకత్వం: శైలేష్‌ కొలను.  ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events