Namaste NRI

నాటా మహాసభల్లో మహిళా సాధికారితకు వినూత్న కార్యక్రమాలు : స్వాతి

ఈ నెల 30 నుంచి అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) మహాసభలు ఘనంగా జరగనున్నాయి. డల్లాస్‌లో జులై 1, 2 తేదీల్లో విమెన్స్‌ ఫోరం కార్యక్రమాలు విమెన్‌ ఎంపవర్మెంట్‌ ముఖ్యోద్దేశంగా ఉండేలా విభిన్నంగా ఏర్పాట్లు చేస్తున్నామని నాటా కన్వెన్షన్‌ 2023 విమెన్స్‌ ఫోరం చైర్‌పర్సన్‌ స్వాతీ సానపురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విమెన్స్‌ ఫోరం అంటే కుట్లు అల్లికలు సరాదా ముచ్చట్లు కాదు, మహిళా సాధికారత అని చాటి చెప్పేలా తమ కార్యక్రమాలు విభిన్నంగా, వినూత్నంగా రూపుదిద్దుకుంటున్నాయని అని పేర్కొన్నారు.

జులై 1న వివిధ రంగాల్లో ప్రముఖులైన ఉపన్యాసాలు, పురాతన చీరల ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. జులై 2న టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌తో మొదలై, మహిళ తెలుసుకో సెగ్మెంట్‌లో అలంకరణపరంగా దైనందిన జీవన విధానంలో అలవర్చుకోవాల్సిన సూచనలు, సొగసు చూడతమాలో కనువిందైన వస్త్రధారణ ఉంటుందని తెలిపారు. నాటా సభల్లో వాసిరెడ్డి పద్మ, ఊమా భారతి కోసూరి, అమల దుగ్గిరాల, మణి  శ్రాస్తి, పద్మ సొంటి, ఉమా దేవిరెడ్డి, వసంత లక్ష్మి అయ్యగారి, వైష్టవి రంగరాజన్‌, ప్రేమ రొడ్డం, కీర్తన శాస్త్రి, పల్లవి శాస్త్రి, అపూర్వ చరణ్‌ మరియు వివేక్‌ తేజ చేరుపల్లి తదితరులు పాల్గొననున్నారు.

Social Share Spread Message

Latest News