Namaste NRI

సౌదీ అరేబియా తీపి కబురు

అరబ్ దేశం సౌదీ అరేబియా  ఉమ్రా యాత్రికులకు తాజాగా తీపి కబురు చెప్పింది. యాత్రికులకు ఇ-వీసా ల జారీని ప్రారంభించింది. ఈ మేరకు తాజాగా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉమ్రా యాత్ర కోసం వచ్చే విదేశీయుల కోసం ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సౌకర్యం వల్ల మరింత మంది ముస్లిం భక్తులు ఉమ్రా నిర్వహించుకోవడానికి వీలు పడుతుందని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇక ఇ-వీసాల దరఖాస్తుల కోసం నూసక్ ప్లాట్‌ఫారమ్ (Nusuk platform)- https://www.nusuk.sa/ar/about ను సంప్రదించాలని కోరింది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మక్కా మరియు మదీనాలను సందర్శించడానికి సేవలను అందిస్తుందని తెలిపింది. అలాగే గృహ, రవాణా మరియు సమాచార సేవలను బహుళ భాషలలో పొందవచ్చని తెలియజేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events