Namaste NRI

వరుణ్‌తేజ్‌ సరసన  హర్యానా సుందరి

తెలుగు తారాపథంలో దూసుకుపోతున్నది హర్యానా సుందరి మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఖిలాడీ, హిట్‌-2 సినిమాలతో యువతరానికి చేరువైంది. చక్కటి అందం, అభినయం కలబోతగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మహేష్‌బాబు తాజా చిత్రం గుంటూరు కారం నుంచి పూజాహెగ్డే తప్పుకోవడంతో ఆ స్థానంలో నాయికగా అవకాశాన్ని సంపాదించుకొని ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది.తాజాగా ఈ భామ మరో భారీ చిత్రంలో అవకాశాన్ని చేజిక్కించుకుంది. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా పలాస ఫేమ్‌ కరుణకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనుంది. ఈ నెల 27న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇందులో వరుణ్‌తేజ్‌ సరసన కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. 1960 నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె పాత్ర అభినయ ప్రధానంగా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది.

Social Share Spread Message

Latest News