నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతినిధి-2. మూర్తి దేవగుప్తపు దర్శకుడు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది ప్రతినిధి సిరీస్ నుండి వస్తున్న రెండో ఫ్రాంచైజీ కానుందని, పొలిటికల్ థ్రిల్లర్గా గ్రిప్పింగ్ కథనంతో, ఆసక్తికరమైన స్క్రీన్ప్లేతో చిత్రం వుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఫస్ట్-లుక్ పోస్టర్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్తో అందరినీ ఆకట్టుకుంది. పోస్టర్లో చూపిన విధంగా ఈ చిత్రం 2024 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్.
