Namaste NRI

జనవరిలో ఎమర్జెన్సీ

బాలీవుడ్‌ క్వీన్‌, మండి ఎంపీ కంగనా రనౌత్‌   ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్‌, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె దర్శకురాలు కూడా. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం,  పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఎట్టకేలకు తాజాగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

ఈ మేరకు ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 17న ఎమర్జెన్సీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కంగనా రనౌత్‌ స్వయంగా ప్రకటించారు. భారత దేశంలో శక్తిమంతమైన మహిళ చరిత్ర, దేశ విధిని మార్చిన క్షణాలు వచ్చే ఏడాది జనవరి 17న మీ ముందుకు రాబోతున్నాయి  అంటూ కంగనా పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events