Namaste NRI

మరింత భారం కానున్న హెచ్-1బీ…

అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై మరింత భారం పడనుంది. అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేందుకు పాలనా యంత్రాంగం ప్రతిపాదించింది.హెచ్‌-1బీ  ఆశావహులకు షాక్‌ ఇచ్చే వార్త ఇది. ప్రతిపాదిత బడ్జెట్‌ రీకాన్షిలియేషన్‌ బిల్లుకు అమెరికా చట్టసభలు ఆమోదం తెలిపితే.. హెచ్‌-1బీ వీసా మరింత భారం కానున్నది. వీసా దరఖాస్తు ఫీజుకు సప్లిమెంటరీ ఫీజు కింద అదనంగా 500 డాలర్లను (రూ.37,280) వసూలు చేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే, హెచ్‌`1బీ వీసాతో అగ్రరాజ్యానికి వెళ్లే భారత ఐటీ నిపుణులపై ఆర్థిక భారం మరింతగా పెరుగనున్నది.

                 హెచ్‌-1బీ వీ దరఖాస్తు రుసుమును పెంచితే గనుక ఆ ప్రభావం ఎక్కువగా భారతీయ ఐటీ కంపెనీలపైనే పడనుంది. హెచ్‌`1బీ వీసాపై అమెరికా వెళ్లేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ఇప్పుడు దరఖాస్తు ఫీజు పెంచితే ఐటీ కంపెనీలపై ఆర్థికంగా అదనపు భారం పడుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events