
టిడిపి ఎన్ఆర్ఐ విభాగం స్కాట్లాండ్ ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. అప్ హాల్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున హాజరయ్యారు. కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ వర్చువల్గా ప్రసంగించారు. ప్రవాసాంధ్రులు టిడిపికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్ పోట్లురీ , డా. శ్రీకాంత్ లావు, రమేష్ గోల్కొండ తదితరులు పాల్గొన్నారు.





























