Namaste NRI

తాలిబన్లు కీలక నిర్ణయం

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వానికి సంబంధించి తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వ అధికారులు స్మార్ట్‌ఫోన్లు వాడకుండా నిషేధం విధించారు. అంతేకాదు, అధికారులు స్మార్ట్‌ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, వారివద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లను తీసుకుని, అన్నింటినీ కలిపి బహిరంగంగా ధ్వంసం చేశారు. ఈ అంశంపై తాలిబన్ మిలిటరీ కోర్టులు అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి.ఉన్నతాధికారుల నుంచి జనరల్ స్టాఫ్‌ వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. వీరెవరూ స్మార్ట్‌ఫోన్లు వాడటానికి వీల్లేదు. సుప్రీం లీడర్‌కు మాత్రమే ఫోన్‌ వాడేందుకు అనుమతించారు. ఈ ఆదేశాలు అధికారికంగా వెలువడటం మాత్రమే కొత్త. కానీ, కొంతకాలంగా ఈ ఫోన్ల వాడకంపై అనేక ఆంక్షల్ని తాలిబన్లు అనధికారికంగా అమలు చేస్తున్నారు.

తాజా ఆదేశాల ప్రకారం ఎవరైనా అధికారి ఫోన్ వాడుతూ పట్టుబడితే ఆ ఫోన్‌ను వెంటనే ధ్వంసం చేస్తారు. అలాగే, కోర్టు నియమాలకు అనుగుణంగా, షరియా చట్టాలకు అనుగుణంగా శిక్షలు విధిస్తారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే అధికారుల వద్ద ఉన్న ఫోన్లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. వందలాది ఫోన్లను ఒకేచోట చేర్చి ధ్వంసం చేశారు. ఫోన్లు వాడటం వల్ల కొన్ని కీలక డాక్యుమెంట్లు లీక్ కావడం, ఉత్పత్తి తగ్గిపోవడం, పనులు మందగించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events