Namaste NRI

దాడులు ఆపకపోతే చర్చల్లేవ్‌ : ఇరాన్‌ హెచ్చరిక

లెబనాన్‌పై దాడులు ఆపకపోతే అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్‌ హెచ్చరించింది. లెబనాన్‌తో సహా అన్ని వైపులా యుద్ధాన్ని ముగించటం అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరిన తొలి ఒప్పందంలో భాగంగా ఉంది. అయినప్పటికీ, లెబనాన్‌లో హెజ్బొల్లా స్థావరాల్ని టార్గెట్‌ చేస్తూ ఇజ్రాయెల్‌ మిలిటరీ దాడులు జరపటం అమెరికాతో శాంతి ఒప్పందంపై సందేహాల్ని పెంచింది. లెబనాన్‌తో యుద్ధాన్ని ముగించాలన్నది మొదటి నిబంధన. దీనిని అమల్లోకి తీసుకురాకుండా చర్చ ల్ని ప్రారంభించటం కుదరదు అని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయి పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News