Skip to main content

Namaste NRI

భారత్‌ అరుదైన ఘనత .. ప్రపంచంలోనే

ప్రపంచ అత్యుత్తమ టాప్ 10 పాఠశాలల జాబితాలో మన దేశానికి చెందిన ఐదు పాఠశాలలు స్థానం సంపాదించుకుని తమ సత్తా చాటుకున్నాయి. బ్రిటన్‌కు చెందిన వరల్డ్ బెస్ట్ స్కూల్ ప్రైజెస్ ఈ ద్వివార్షిక పోటీని నిర్వహించింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన ఈ ఐదు పాఠశాలలు వివిధ కేటగిరీల కింద స్ఫూర్తిదాయకమైనవిగా పరిగణించారు. ఢిల్లీకి చెందిన నగర్ నిగం ప్రతిభా బాలిక విద్యాలయ , ముంబైకి చెందిన ఒబెరాయ్ ఇంటర్నేషనల్ స్కూల్, షిండేవాడి ముంబై పబ్లిక్ స్కూల్, గుజరాత్ లోని అహ్మదాబాద్‌కు చెందిన రివెర్‌సైడ్ స్కూల్, మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్‌కు చెందిన స్నేహాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎంపికయ్యాయి. సామాజిక సహకారం లోను, , పర్యావరణ కార్యాచరణ, నూతన ఆవిష్కరణ, ప్రతికూతలను అధిగమించడం, ఆరోగ్యకరజీవిత సహకారం తదితర ఐదు కేటగిరీల కింద ఈ పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ కేటగిరీలకు సంబంధించిన 2,50,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2 కోట్లు )నగదు బహుమతిని ఈ పాఠశాలలకు సమానంగా పంచుతారు.

Social Share Spread Message

Latest News