Namaste NRI

ఘోర విషాదం.. రష్యాలో నలుగురు భారతీయ విద్యార్థులు

ర‌ష్యాలో న‌లుగురు భార‌తీయ వైద్య విద్యార్థులు  న‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ స‌మీపంలో ఉన్న న‌దిలో వాళ్లు మునిగిపోయారు. ఆ విద్యార్థుల మృత‌దేహాల‌ను భార‌త్‌కు పంపేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఇండియ‌న్ ఎంబ‌సీ పేర్కొన్న‌ది. నోవోగ‌రోడ్ సిటీలో ఉన్న స్టేట్ యూనివ‌ర్సిటీలో ఆ విద్యార్థులు వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. 18 నుంచి 20 ఏళ్ల మ‌ధ్య ఉన్న ఇద్ద‌రు అమ్మాయిలు, ఇద్ద‌రు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఓ అమ్మాయి న‌ది నీటిలో కొట్టుకుపోతున్న స‌మ‌యంలో, ఆమెను ర‌క్షించేందుకు మిగితా ముగ్గురు న‌దిలోకి దిగారు. అయితే వాళ్లు కూడా ఆ న‌ది నీటిలో మునిగిపోయారు.

వాళ్ల‌తో ఉన్న మ‌రో ఓ విద్యార్థి మాత్రం ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. బంధువుల‌కు మృత‌దేహాల‌ను పంపించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఓ విద్యార్థికి చికిత్స అందిస్తున్న‌ట్లు మాస్కోలోని భార‌తీయ ఎంబ‌సీ పేర్కొన్న‌ది. బాధిత బంధువుల‌కు సమాచారాన్ని చేర‌వేసిన‌ట్లు అధికారులు తెలిపారు. వీరు మహారాష్ట్రలోని జలగావ్‌కు చెందినవారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events