పాకిస్తాన్ వెబ్ కంటెంట్పై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించింది. దాయాది దేశం పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఓటీటీ వేదికల కంటెంట్ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారత్లో పాక్ వెబ్ సిరీస్లు ఆగిపోనున్నాయి. సినిమాలు, పాటలు పాడ్ కాస్ట్ సహా మీడియా కంటెంట్ సేవలన్నీ రద్దు చేయాలన్నారు. వీటన్నింటిని అన్ని రకాల మీడియా కంటెంట్ ప్లాట్ ఫాం నుంచి తొలగించాలని భారత్కు చెందిన ఓటీటీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్తాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్, ఓటీటీ వేదికలు, మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ఫాంలు, మధ్యవర్తిత్వం ద్వారా అయ్యే ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం. పాకిస్తాన్ వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్ కాస్ట్లు సహా మీడియా కంటెంట్ ఏదీ ఇక భారత్లో అందుబాటులో ఉండదు. సబ్స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీ వేదికలు పాకిస్తాన్ కంటెంట్ను భారత్లో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదు అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
