అమెరికాలోని న్యూయార్క్లో వలసల సంక్షోభం నెలకొంది. దీంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అత్యవసర పరిస్థితిని విధించారు. రిపబ్లికన్ పాలిత రాష్ట్రాలైన టెక్సాస్, అరిజోనా, ఫ్లోరిడా నుంచి డెమోక్రటిక్ రాష్ట్రాలకు వలసలు పెరిగిపోయాయి. సెప్టెంబర్ నుంచి ప్రతిరోజూ శరుణార్థులతో కూడిన 5`6 బస్సులు న్యూయార్క్లో ప్రవేశిస్తున్నాయని ఆడమ్స్ తెలిపారు. నగర షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారిలో ప్రతి ఐదుగరిలో ఒకరు శరణార్థులేనని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దక్షిణ సరిహద్దు గుండా నగరంలోకి 17 వేల మందికి పైగా వలస వచ్చారు. వలస వచ్చే వారిలో చిన్నారులు, వైద్యసేనలు అవసరమున్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వారందరినీ ఆదుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు రూ.వంద కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ వలసల వల్ల ఇతర పనులకు వెచ్చిందేందుకు నిధులు లేకుండా పోయాయని వెల్లడిరచారు. కావాలనే రిపబ్లికన్ రాష్ట్రాల నుంచి జనాలను ఇక్కడికి పంపిస్తున్నారని ఆరోపించారు. నగర సామాజిక సేవలను కొందరు రాజకీయ లద్ది కోసం వాడుకుంటున్నారని రిపబ్లికన్ పార్టీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.














