కెంటకీ రాష్ట్రంలోని లుయివిల్ నగరంలో కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు, ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జీవా ఫౌండేషన్ బృందం నృత్య రూపకం, మనబడి విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు అలరించాయి. అనిల్ గంటేటి, రఘు దేవరకొండ, గజానన్ ముదల్కర్, ఈశ్వర్ వారణాశి బృందం ప్రదర్శించిన గ్లెన్ టెటి బాబా స్కిట్ ప్రేక్షకులను నవ్వించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/04/2904nribrk1d.jpg)
ఈ సందర్భంగా అధ్యక్షులు శ్యాం కోయ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల తెలుగు ఎన్నారైలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహకరించిన కార్యనిర్వాహక బృందం, వాలంటీర్లను బోర్డు చైర్మన్ శ్రీని జూలకంటి అభినందించారు. మోహన్ తాళ్లూరి, సుష్మా తాళ్లూరి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా కొనసాగింది. శ్రీనివాస్ వేమూరి, శిరీష వనం, రమ్య పెంట సాంస్కృతిక కార్యదర్శులుగా వ్యవహరించారు. హైదరాబాద్ హౌస్ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి విందు భోజనం అందించారు. ఈ ఉగాది వేడుకల్లో ప్రవాస తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/04/2904nribrk1a.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2024/04/2904nribrk1b.jpg)